అభినవ మహానటిగా టాలీవుడ్ లో అందరి నీరాజనాలు అందుకుంటున్న మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్.ఈ అమ్మడు క్రేజ్ ఇప్పుడు సౌత్ లో ఆకాశం అంత ఎత్తులో ఉంది.
ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ కి సిద్ధమై ఉండగా మరో ఎనిమిది సినిమాల వరకు ఈమె కమిట్ అయ్యి ఉంది.వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా ఉంది.
మొత్తానికి కీర్తి సురేష్ ప్రస్తుతం సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా ఉండటమే కాకుండా ఏకంగా తెలుగు, తమిళం, మలయాళంలో తన హవాని కొనసాగిస్తుంది.ఆమె తెలుగులో నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందని చాలా మంది భావిస్తారు.
అయితే అంతకంటే ముందుగానే కీర్తి సురేష్ తెలుగులో ఒక సినిమా చేసింది.అయితే ఆ సినిమా ఇప్పటికి కూడా రిలీజ్ కి నోచుకోలేదు.
ప్రస్తుతం కీర్తి సురేష్ క్రేజ్ భాగా ఉండటంతో ఓటీటీ సంస్థలు కూడా ఆమె సినిమాల మీద ఆసక్తి చూపిస్తూ ఉండటంతో ఆమె మొదటి సినిమాని ఒటీటీలో రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు.
యాక్టర్ నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణతో కీర్తి హీరోయిన్ గా మొదటి సినిమా చేసింది.
వీళ్లిద్దరికీ అదే మొదటి సినిమా.ఆర్ధిక కారణాల వల్ల ఆ సినిమా రిలీజ్ కి నోచుకోలేదు.
ఆ సినిమా తర్వాత నేను శైలజలో కీర్తి ఎంట్రీ ఇచ్చి, మహానటితో స్టార్ హీరోయిన్ అయిపొయింది.ఆమె మొదటి సినిమా పేరు ఐనా ఇష్టం నువ్వు.
ఈ సినిమాకి రాంప్రసాద్ దర్శకత్వం వహించారు.ఎన్నో హిట్ సినిమాలు తీసిన ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్ పై అడ్డాల చంటి ఈ సినిమాని నిర్మించాడు.5 ఏళ్ళ తరువాత ఇప్పుడు ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి దర్శక నిర్మాతలు రెడీ అవుతున్నారు.ఇప్పటికే ఈ సినిమాని విడుదల చేయడానికి కొన్ని ఓటీటీ సంస్థలతో మాట్లాడారని సమాచారం.
కీర్తి క్రేజ్ నేపధ్యంలో ఈ సినిమాని కొనడానికి ఒటీటీ సంస్థలు కూడా ఆసక్తిగానే ఉన్నాయని తెలుస్తుంది.అన్ని అనుకూలిస్తే త్వరలో ఈ సినిమా ఓటీటీ ద్వారా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.