ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.ఆ వ్యాపార వేత్త బీజేపీ నాయకుడి కొడుకు అంటూ కూడా పుకార్లు షికార్లు చేశాయి.
పెద్దలు వీరి పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారని, కీర్తి సురేష్ది పెద్దలు కుదిర్చిన పెళ్లి అంటూ ప్రచారం మొదలైంది.రెండు మూడు రోజులు తమిళ, తెలుగు భాషల మీడియాల్లోనే కాకుండా దాదాపు అన్ని భాషల్లో కూడా కీర్తి సురేష్ పెళ్లిక సంబంధించిన వార్తలు ప్రారంభం అయ్యాయి.
తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై కీర్తి సురేష్ వెంటనే స్పందించింది.ప్రస్తుతం తాను పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టాను మరో ఆలోచన కూడా లేకుండా నేను షూటింగ్స్తో బిజీగా ఉన్నాను.రాబోయే రెండు సంవత్సరాల పాటు నేను డేట్లు పూర్తిగా ఇప్పటికే ఇచ్చేసి ఉన్నాను అంటూ క్లారిటీ ఇచ్చింది.అయితే ఇప్పుడు ఈ పుకార్లు పుట్టడానికి గల కారణం ఏంటీ అంటూ తమిళ మీడియాలో చర్చ జరుగుతోంది.
కమెడియన్ సతీష్ ముత్తు కృష్ణన్ వల్లే ఈ పుకార్లు మొదలయ్యాయి అంటూ కొందరు భావిస్తున్నారు.
కారణం ఏంటో కాని సతీష్ ముత్తు కృష్ణన్ ఈ ప్రచారంను మొదలు పెట్టడంతో అది కాస్త చాలా పెద్ద స్థాయికి వెళ్లిందని అంటున్నారు.
కీర్తి సురేష్ ఇంకా సతీష్ల మద్య మంచి స్నేహం ఉంది. ఆ కారణంగా అతడు పుకార్లను పుట్టించాడా లేదంటే మరేదైనా కారణం ఉందా అనేది మాత్రం తెలియదు.
తన పెళ్లి గురించి మీడియాలో పుకార్లు పుట్టించినందుకు గాను ప్రస్తుతం కీర్తి సురేష్ ఆయనపై చాలా కోపంగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.