మీ సృజనాత్మక శైలికి ఇదే సమయం అంటున్న కీర్తి సురేష్.....

తెలుగులో ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించినటువంటి “నేను శైలజ” అనే చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ కీర్తి సురేష్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈమె వచ్చీరావడంతోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంది.

 Keerthi Suresh Stitching Machine Ad Goes Viral Keerthi Suresh, Tollywood Heroi-TeluguStop.com

అంతే కాక వాటిని బాగానే సద్వినియోగం కూడా చేసుకుంది.అయితే ఇప్పటి వరకు ఈమె సినీ కెరీర్లో నటించినటువంటి “మహానటి” చిత్రం అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ చిత్రంగా ఉంటుంది.

అయితే ఈ అమ్మడు ప్రస్తుతం ఒక పక్క సినిమాలు మరో పక్క ప్రకటనలలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది.అయితే తాజాగా ఈ అమ్మడు ప్రముఖ కుట్టు మిషన్ల సంస్థ అయినటువంటి ఉష కంపెనీ ఉత్పత్తులు ప్రమోషన్స్ కోసం చిత్రీకరించినటువంటి ఓ యాడ్ లో నటించింది.

ఇందుకుగాను కీర్తి సురేష్ బాగానే పారితోషికం డిమాండ్ చేసినట్లు సమాచారం.అయితే కీర్తి సురేష్ నటించినటువంటి ఈ ప్రకటన సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది.దీనివల్ల కంపెనీ ఉత్పత్తులు కూడా బాగానే ప్రమోషన్స్ లభిస్తున్నాయి.దీంతో ఉష సంస్థ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో రంగ్ దే అనే చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తుండగా ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే ఇప్పటికే ఈ అమ్మడు నటించిన టువంటి మిస్ ఇండియా అనే చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube