తెలుగులో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించినటువంటి “నేను శైలజ” అనే చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైనటువంటి కీర్తి సురేష్ తన మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అయితే ఆ తరువాత అలనాటి అందాలతార మరియు స్వర్గీయ హీరోయిన్ సావిత్రి జీవిత గాథ ఆధారంగా మహానటి చిత్రంలో సావిత్రి పాత్ర పోషించి తెలుగు, తమిళ ప్రేక్షకులను తన నటనతో కంటతడి పెట్టించింది.
అంతగా తన చిత్రాలతో కట్టిపడేసింది కీర్తి సురేష్.
అయితే తాజాగా కీర్తి సురేష్ కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.తన తల్లిదండ్రులతో చిన్నప్పుడు కీర్తి సురేష్ కలిసి తీయించుకున్న ఫోటో లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.దీంతో నెటిజన్లు కీర్తి సురేష్ చిన్నప్పుడు చాలా క్యూట్ గా ఉందని అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.
అంతేగాక కీర్తి సురేష్ అభిమానులు ఈ ఫోటోలని సోషల్ మీడియాలో బాగానే ట్రెండింగ్ చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కీర్తి సురేష్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న “రంగ్ దే” అనే చిత్రంలో నితిన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే నితిన్ హీరోగా నటిస్తున్నటువంటి పవర్ పేట అనే చిత్రంలో కూడా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.మరోవైపు ఈ అమ్మడు ఇప్పటికే హీరోయిన్ గా నటించినటువంటి “మిస్ ఇండియా” అనే చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.