మల్లు బ్యూటీ కీర్తి సురేష్ తెలుగులో నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మహానటి సినిమాతో ఆమె తన ఇమేజ్ ని ఆకాశం అంత ఎత్తుకి పెంచేసుకుంది.సౌత్ ఇండియాలో కామన్ ఆడియన్స్ నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కీర్తి సురేష్ నటనకి ఫిదా అయిపోయారు.
దీంతో ఊహించని విధంగా కోలీవుడ్ లో ఈ భామ, ధనుష్, విజయ్, సూర్య, విశాల్ లాంటి స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశాలు సొంతం చేసుకుంది.ఇక సూపర్ స్టార్ రజిని, మురుగదాస్ కలయికలో వస్తున్న సినిమాలో కూడా కీర్తి సురేష్ ని హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.
ఇదిలా వుంటే ఇప్పుడు కీర్తి సురేష్ ఊహించని విధంగా బాలీవుడ్ లో కూడా ఆఫర్ పట్టేసింది అని తెలుస్తుంది.అతిలోక సుందరి శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మాతగా బదాయి హో సినిమాతో హిట్ కొట్టిన అమిత్ శర్మ దర్శకత్వంలో తెరకేక్కే లేడీ ఓరియంటెడ్ సినిమాలో కీర్తి సురేష్ ని హీరోయిన్ గా ఫైనల్ చేసుకున్నారని తెలుస్తుంది.
ఈ సినిమా కోసం చాలా మంది హీరోయిన్స్ కి స్క్రీన్ టెస్ట్ చేసిన ఫైనల్ గా కీర్తి సురేష్ ఈ స్టొరీకి యాప్ట్ అని దర్శకుడు భావించడంతో ఆమెని నిర్మాత ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.మరి సౌత్ లో సత్తా చాటుతున్న కీర్తి బాలీవుడ్ ప్రేక్షకులని ఎ మేరకు ఆకట్టుకుంటుంది చూడాల్సిందే.
.