మహానటి సినిమాతో టాలీవుడ్ లో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేంజ్ కి దూసుకుపోయిన నటి కీర్తి సురేష్.ఆమె కెరియర్ లో మహానటి సినిమా ఇప్పటికి ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆ సినిమా తర్వాత వెంటనే కమర్షియల్ సినిమాలలో హీరోకి జోడీగా నటిస్తే తెలుగు ప్రేక్షకులు తిరస్కరించే అవకాశం ఉందని భావించిన ఆమె రెండేళ్ళ పాటు తెలుగు సినిమాకి దూరమయ్యింది.తమిళంలో సూర్య, విశాల్ కి జోడీగా నటించిన తెలుగు సినిమాలలో మాత్రం హీరో కాంబినేషన్ చేయడానికి కొంత సమయం తీసుకుంది.
ప్రస్తుతం మిస్ ఇండియా అనే లేడీ ఒరియాంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.
ఇక ప్రేక్షకులు కూడా మహానటి హేంగోవర్ నుంచి బయటకి వచ్చేసారు కాబట్టి ఇప్పుడు హీరోలతో రొమాన్స్ అన్నా చూస్తారు.
అందుకే మెల్లగ నితిన్ కి జోడీగా వెంకి అట్లూరి దర్శకత్వంలో తెరకేక్కబోయే రంగ్ దే సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇదిలా ఉంటే కీర్తి సురేష్ తేజ దర్శకత్వంలో అలివేలు మంగ-వెంకటరమణ సినిమాకి కూడా ఒకే చెప్పేసింది.
ఈ సినిమాలో గోపీచంద్ హీరోగా చేస్తున్నాడు.ఇక ఇందులో మొదటిగా కాజల్ ని హీరోయిన్ గా అనుకున్న తేజ ఇప్పుడు ఆమెని కాదనుకొని కీర్తిని ఫైనల్ చేసాడు.
అయితే ఈ విషయంపై దర్శకుడు తేజ ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు.మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.