నితిన్ తో జోడీ కడుతున్న మహానటి

సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో మెప్పించిన మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ఒక్కసారిగా టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.ఇక ఈ సినిమా తర్వాత తమిళంలో ఫుల్ బిజీగా మారిపోయిన కీర్తి సురేష్ వరుసగా స్టార్ హీరోలతో నటించి మెప్పించింది.

 Keerthi Suresh Ready To Romance With Nithin-TeluguStop.com

తమిళంలో విజయ్ విశాల్ లాంటి స్టార్ హీరోలతో నటించిన కీర్తి సురేష్ మళ్లీ మహానటి సినిమా తర్వాత తెలుగులో నటించే అవకాశం రాలేదు.అయితే చాలా గ్యాప్ తర్వాత తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కీర్తి సురేష్ ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది.

మరోవైపు బాలీవుడ్ లో బోని కపూర్ నిర్మాణ ప్రొడక్షన్ లో ఓ సినిమా కమిట్ అయిన కీర్తి సురేష్ తెలుగులో బాలీవుడ్ దర్శకుడు తెరకెక్కించే రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ఆది పినిశెట్టి తో ఆడిపాడేందుకు సిద్ధమైంది.

ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం నితిన్ హీరోగా తెరకెక్కే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా బీష్మ అనే సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట గా రష్మిక అని అనుకున్నా ఏవో కారణాల వల్ల ఆమె చేయలేకపోతోందని సమాచారం.

దీంతో దర్శకుడు హీరోయిన్ పాత్ర కోసం కీర్తి సురేష్ ని సంప్రదించినట్లు టాలీవుడ్లో వినిపిస్తున్న టాక్.కీర్తి సురేష్ కూడా దర్శకుడు చెప్పిన కథ విని సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.

అదే జరిగితే మహానటి తర్వాత ఈ మలయాళీ ముద్దుగుమ్మ కుర్ర హీరోలతో జోడీ కట్టింది సిద్ధమవుతుందని చెప్పొచ్చు.మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించి అంతవరకు వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube