సినిమా ఇండస్ట్రీలో సీజన్ బట్టి కొంత మంది హీరోయిన్స్ కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.కాజల్, తమన్నా, అనుష్క, నయనతారలు దశాబ్దం పాటు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ గా టాలీవుడ్ ని రూల్ చేశారు.
తరువాత ఈ ప్లేస్ లోకి రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి చేరింది.వరుసగా స్టార్ హీరోలతో జత కట్టి ఓ ఐదేళ్ళ పాటు ఈ అమ్మడు తన హవా కొనసాగించింది.
ఇప్పుడు ఈ రేస్ లోకి పూజా హెగ్డే, రష్మిక మందన దూసుకొచ్చారు.ఈ ఇద్దరు భామలు వరుసగా స్టార్ హీరోల చిత్రాలలో నటిస్తూ తన హవా కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం పూజా, రష్మిక స్పీడ్ తెలుగులో ఒక రేంజ్ లో ఉంది.అయితే కీర్తీ సురేష్ చాలా సైలెంట్ గా వీళ్ళ వేవ్ ని బ్రేక్ చేసుకొని దూసుకుపోతుంది.
పూజా హెగ్డే బాలీవుడ్ లో రెండు సినిమాలు, టాలీవుడ్ లో ప్రభాస్, అఖిల్ అక్కినేని సినిమాలు చేస్తుంది.అలాగే రష్మిక మందన్న అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తుంది.
అలాగే కన్నడలో ఒక సినిమా, తమిళంలో ఒక సినిమా చేస్తుంది.హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక బైలింగ్వల్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది.
అఫీషియల్ గా అయితే పూజా హెగ్డే చేతిలో 4 సినిమాలు, రష్మిక మందన్న చేతిలో 3 సినిమాలు ఉన్నాయి.అయితే కీర్తి సురేష్ వరుసగా పెంగ్విన్, నితిన్ రంగ్ దే, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ, సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నాత్తే సినిమాలతో పాటు ఒక మళయాళం సినిమాని లైన్ లో పెట్టింది.
ఈమె ఖాతాలో మొత్తం 6 సినిమాలు ఉన్నాయి.ఇవి కాకుండా నితిన్ తో మరో సినిమా చేయడానికి ఒకే చెప్పింది.
ఈ లెక్కన చూసుకుంటే కీర్తి సురేష్ ఆ ఇద్దరి అందాల భామలని బీట్ చేస్తుందని చెప్పాలి.అయితే కీర్తి ఖాతాలో కమర్షియల్ సినిమాలు తక్కువ.
పూజాహెగ్డే, రష్మిక చేస్తున్న సినిమాలన్నీ కమర్షియల్ సినిమాలే.