ప్రస్తుతం సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగిస్తున్న మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్.మహానటి సినిమాతో కీర్తి సురేష్ అభినవ మహానటిగా మారిపోయింది.ఈమెని చూసిన అందరూ మరల సావిత్రిని గుర్తు చేసుకుంటున్నారు.తెలుగు, తమిళ్, మలయాళీ బాషలలో వరుస సినిమాలతో ఈ అమ్మడు ఫుల్ బిజీగా ఉంది.ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో ఎనిమిది సినిమాల వరకు ఉన్నాయి.వాటిలో అన్ని కూడా పెద్ద ప్రాజెక్టులే.
ఇక రిలీజ్ కి కూడా ఓ రెండు సినిమాలు రెడీగా ఉన్నాయి.ఇదిలా ఉంటే లాక్ డౌన్, కరోనా కారణంగా ఇంటికే పరిమితం అయినా అందాల భామలు వారి జీవితంలో ఆసక్తికరమైన జ్ఞాపకాలని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు.
అలాగే ఇంటర్వ్యూలలో కూడా షేర్ చేసుకుంటున్నారు.
ఈ నేపధ్యంలో కీర్తి సురేష్ కూడా తనకి లైఫ్ లో వచ్చిన మొదటి ప్రేమలేఖ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.
కాలేజీ రోజుల్లో తనకు ఎన్ని లవ్ లెటర్స్ వచ్చాయన్న ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చింది.తనకు కాలేజీ రోజుల్లో ఎవరూ ప్రేమ లేఖను రాయలేదని చెప్పిన ఆమె, నేను ఒకసారి జ్యూయెలరీ షాప్ ఓపెనింగ్ కు వెళ్లాను.
అక్కడికి వచ్చిన ఓ అభిమాని, నాకు ఓ బహుమతిని ఇచ్చి వెళ్లాడు.అందులో నా ఫోటోలను అల్బమ్ గా ఎంతో చక్కగా అమర్చాడు.వాటితో పాటే ఓ ఉత్తరాన్ని కూడా అతను రాశాడు.అందులో ఏముందని చూస్తే, నాకు ప్రపోజ్ చేస్తూ లవ్ లెటర్ రాశాడు.
దాన్ని నేను చాలా భద్రంగా దాచుకున్నాను అని చెప్పింది.మొత్తానికి కాలేజీ రోజుల్లో దొరకని ప్రేమలేఖ కీర్తి హీరోయిన్ అయ్యాక దొరికిందని ఆమె మాటల బట్టి అర్ధమవుతుంది.