సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది.నేడు మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా టీజర్ ను విడుదల చేశారు.
మహేష్ బాబు బర్త్ డే టీజర్ లో కేవలం మహేష్ బాబు మాత్రమే ఉంటాడని అంతా అనుకున్నారు.కాని సినిమా లో కీర్తి సురేష్ మరియు వెన్నెల కిషోర్ కూడా కనిపించారు.
ముఖ్యంగా కీర్తి సురేష్ లుక్ కు అంతా ఫిదా అవుతుంటే కొందరు మాత్రం కీర్తి ఇలా అయ్యింది ఏంటో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి ఈ అమ్మడి లుక్ మరియు దిష్టి తియ్యండి అంటూ చెప్పిన డైలాగ్ భలే ఉందే అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కీర్తి సురేష్ సన్నబడింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే ఈ లుక్ లో ఆమె చాలా బాగుందని అంటున్నారు.మరి కొందరు మాత్రం ఆమె లుక్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది కదా అంటున్నారు.
ఇక మహేష్ బాబు వయసులో సగం ఉండే కీర్తి సురేష్ ఆయనకు జోడీగా అద్బుతంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.ప్రస్తుతం ఇద్దరి కాంబోలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు.సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసేందుకు గాను చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి.భారీ ఎత్తున అంచనాలు ఉన్న ఈ సినిమాతో కీర్తి సురేష్ టాలీవుడ్ లో మహానటి తర్వాత బిగ్గెస్ట్ సక్సెస్ ను దక్కించుకోవడం ఖాయం అంటున్నారు.
వరుసగా చేస్తున్న సినిమాల వల్ల ఇండస్ట్రీలో ఈమెపై అంచనాలు పెరుగుతున్నాయి.కనుక ఈ సినిమా తో బిగ్గెస్ట్ సక్సెస్ ను దక్కించుకోవడం ఖాయం అంటూ మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.
సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాను అతి త్వరలోనే ముగించి త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేయాలని భావిస్తున్నారు.