మన్మధుడు సినిమా కింగ్ నాగార్జునకి ఒక్కసారిగా టాలీవుడ్ లో డిఫరెంట్ ఇమేజ్ తీసుకొచ్చింది.అంత వరకు యువ సామ్రాట్ గా ఉన్న నాగార్జున కాస్తా ఆ సిన్నిమాతో నిజంగానే మన్మధుడు అయిపోయాడు.
ఇదిలా ఉంటే దశాబ్దం క్రితం వచ్చిన ఆ సినిమాకి సీక్వెల్ ప్రస్తుతం తెరకెక్కుతుంది.రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాతో దర్శకుడుగా రెండో సక్సెస్ సాధించే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో నాగార్జునకి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికమరైన అప్డేట్స్ వస్తున్నాయి.
ఈ సినిమాలో నాగార్జునకి జోడీగానే కాకుండా కొన్ని కీలక పాత్రలలో కనిపించడానికి ఇప్పటికే నాగార్జున కోడలు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇక ఇందులో ఓ కన్నడ భామ కూడా నటించడానికి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.
తాజాగా వినిపిస్తున్న వార్తల బట్టి మన్మధుడు 2లో కీర్తి సురేష్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది.ఈ పాత్ర ప్రాముఖ్యత బట్టి కీర్తి ఇన్న్దులో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.
మొత్తానికి మన్మధుడు సీక్వెల్ కోసం దర్శకుడు రాహుల్ చాలా మంది హీరోయిన్స్ ని రంగంలోకి దించేలా ఉన్నాడు అంటూ ఇప్పుడు కామెంట్ వినిపిస్తున్నాయి.