మన్మధుడు 2' లో కీర్తి సురేష్!

కింగ్ నాగార్జున, సోనాలి బింద్రే ప్రధాన పాత్రలో నటించిన మన్మధుడు చిత్రం ఎంతటి విజయం సాధించిన సంగతి తెలిసిందే.అయితే ఎప్పుడో 17 క్రితం విడుదల అయిన మన్మధుడు చిత్రానికి సీక్వెల్ రానున్న సంగతి తెలిసిందే.

 Keerthi Suresh In Manmadhudu 2-TeluguStop.com

అయితే ఈ మన్మధుడు 2 లో నాగార్జున హీరో గా నటిస్తుండగా హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది.రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంలో అన్నీ విశేషాలే.ఈ చిత్రంకి టర్నింగ్ పాయింట్ గా నిలిచే పాత్రలో సమంత నటిస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే మరో విశేషం ఏంటంటే ఈ చిత్రంలో కీర్తి సురేష్ కూడా అతిధి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే మహానటి చిత్రం లో సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటించిన నాగ చైతన్య తో కలిసి కొన్ని సీన్స్ లో నటించి అలరించిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజాగా నాగార్జున తో జత కట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే దీనిపై ఇంకా అధికారికంగా కీర్తి ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోయినప్పటికీ ఈ వార్త నిజమే అని అనిపిస్తుంది.

అయితే ఇది నిజమే కాదో తెలియాలి అంటే మరో కొద్దీ రోజులు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube