సౌందర్య బయోపిక్ లో కీర్తి సురేష్

నేను శైలజా సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్.ఇక ఆమె కెరియర్ లో మహానటి సావిత్రి జీవిత కథతో వచ్చి మహానటి సినిమా ఒక వండర్ అని చెప్పాలి.

 Keerthi Suresh Green Signal To One More Biopic In Tollywood, Telugu Cinema, K Ra-TeluguStop.com

కెరియర్ ఆరంభంలోనే అద్భుతమైన బయోపిక్ లో నటించే అవకాశం రావడంతో పాటు ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా అందుకుంది.సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరోసారి ఆమెని తెలుగు ప్రేక్షకులకి గుర్తు చేసింది.

మహానటి సినిమా తర్వాత మళ్ళీ వెంటనే హీరోయిన్ గా అంటే తెలుగు ప్రేక్షకులు రిసీవ్ చేసుకునే అవకాశం లేదని రెండేళ్ళు తెలుగు సినిమాకి గ్యాప్ ఇచ్చిన కీర్తి ప్రస్తుతం రెండు సినిమాతో వస్తుంది.

అందులో లేడీ ఒరియాంటెడ్ గా వస్తున్నా మిస్ ఇండియా ఒకటి కాగా, నితిన్ కి జోడీగా నటిస్తున్న రంగ్ దె ఒకటి.

ఇదిలా ఉంటే ఇప్పుడు కీర్తి సురేష్ మరో బయోపిక్ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది.ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సౌందర్య జీవిత కథతో రాఘవేంద్రరావు సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడని, ఇందులో కీర్తి సురేష్ సౌందర్య పాత్రలో నటించడానికి ఒకే చెప్పింది అని తెలుస్తుంది.

కన్నడనాట పుట్టి అక్కడ కెరియర్ ప్రారంభించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఎంతో మందికి అభిమాన నటి అయిన సౌందర్య విమాన ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే.సౌందర్య జీవితంలో కీలక దశలని కథగా తీసుకొని రాఘవేంద్రరావు బయోపిక్ తీస్తున్నారని సమాచారం.

ఇక ఈ సినిమా కోసం కీర్తి పర్ఫెక్ట్ ఛాయస్ అని భావించి ఆమెని ఎంపిక చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube