కీర్తి సురేష్ టాలీవుడ్ లో నటించిన మొదటి సినిమా అంటే అందరూ నేను శైలజ అని చెబుతారు.అయితే ఈ సినిమా కంటే ముందుగానే ఆమె మరో తెలుగు సినిమాలో నటించింది.
అయితే ఈ సినిమా ఆర్ధిక కారణాల వల్ల ఇప్పటికి రిలీజ్ కి నోచుకోలేదు.చాలా హిట్ చిత్రాలు నిర్మించిన చంటి అడ్డాల ఈ సినిమాకి నిర్మాత అయినా, చాలా తక్కువ బడ్జెట్ తోనే సినిమా తీసిన కూడా థియేటర్ ల వరకు సినిమాని తీసుకురాలేకపోయారు.
రాంప్రసాద్ రౌతు దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమాని తెరకెక్కించారు.ఈ సినిమాని ఐనా ఇష్టం నువ్వు అనే టైటిల్ ని ముందుగా పెట్టారు.
సీనియర్ హీరో నరేష్ తనయుడు నవీన్ కృష్ణ కి ఇదే మొదటి సినిమా.అయితే ఈ సినిమా రిలీజ్ కాకపోవడంతో హీరో, హీరోయిన్స్ ఇద్దరు దీని గురించి పూర్తిగా మరిచిపోయారు.
అయితే ఇప్పుడు కీర్తి సురేష్ కి క్రేజ్ బాగుండటంతో మళ్ళీ ముందుకి తీసుకొస్తున్నారు.
కొత్త సినిమా అనే ఫ్లేవర్ తగిలించి ఈ సినిమాకి టైటిల్ మార్చేసి రిలీజ్ కి రెడీ చేస్తున్నారు.
ఈ సినిమా గురించి చిత్ర నిర్మాత చంటి అడ్డాల మాట్లాడుతూ ఇప్పటికే చిత్రీకరణ దాదాపు పూర్తయ్యింది.నాలుగు రోజుల ప్యాచ్ వర్క్ మాత్రమే ఉంది.త్వరలోనే దీన్ని కీర్తిసురేష్పై చిత్రీకరిస్తాం.ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి.అక్టోబర్ మొదటి వారానికి తొలికాపీ రెడీ అవుతుంది.థియేటర్స్ ఓపెన్ కాగానే సరైన తేదీ చూసి రిలీజ్ చేేస్తాం అని తెలిపారు.ఈ సినిమాకి జానకితో నేను అని కొత్త టైటిల్ ఖరారు చేశారు.ఇక ఈ సినిమా ప్యాచ్ వర్క్ షూటింగ్ లో కీర్తి సురేష్ పాల్గొంటుందని కూడా నిర్మాత చెప్పడం బట్టి ఆమె దీనిని చేయడానికి ఒప్పుకుందని తెలుస్తుంది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కి ఇన్ని రోజుల తర్వాత రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా కీర్తి కెరియర్ కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది చూడాలి.
.