ఎవరో గుర్తిపట్టరా? ఇంకా లేదా? ఆమెనండి.మన ఈతరం మహానటి.
ఇంకా గుర్తుకురాలేదా? ఆమెనండి మహానటి సావిత్రి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన కాదు కాదు జీవించిన ఆమె.గుర్తొచ్చిందా? హా కీర్తి సురేష్ ఏ.ఎంతో అద్భుతంగా మహానటి పాత్రలో జీవించిన కీర్తి సురేష్ చిన్న నాటి ఫోటోనే అది.ఎంతో అందంగా చూడముచ్చటగా ఉన్న ఈ భామ చిన్నప్పటి నుంచే సినిమాల్లో ఉన్న సంగతి దాదాపు తెలుగు ప్రజలకు తెలియదు.ఎందుకంటే ఈమె చిన్నప్పటి నుంచి తెలుగు సినిమా ల్లో లేదు కాబట్టి.
కీర్తి సురేష్ ఒక నిర్మాత.
నటి కూతురు.మలయాళ నిర్మాత సురేష్ కుమార్, నటి మేనకల ముద్దుల కూతురే కీర్తి సురేష్.
అమ్మ కూడా కొన్ని సినిమా ల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.ఇక అలానే కీర్తి సురేష్ కూడా హీరోయిన్ అయ్యి ఎంతోమంది మనసు దోచింది.ఇక అలాంటి కీర్తి సురేష్ చిన్నప్పటి నుంచే నటిస్తుంది.2000లోనే బాలనటి గా ఆమె తండ్రి నిర్మించిన ”పైలట్స్” అనే చిత్రంలో నటించింది.ఆతర్వాత.‘అచనేయనెనిక్కిష్టం’, ‘కుబేరన్’ వంటి సినిమాల్లో నూ నటించింది.
ఇక కొన్ని సీరియల్స్ లో కూడా నటించిన ఆమె మంచి పేరు సంపాదించింది.హీరోయిన్ గా ఆమె మలయాళంలో ఎంట్రీ ఇవ్వగా 2016లో శైలజ పాత్ర లో నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.
మొదట ఆమె నటనను చూసిన వారు నటన రాదు అని ఎంతోమంది అన్నారు.అలాంటి ఆమె మహానటి సినిమాలో మహానటిలా జీవించి కీర్తి సురేష్ అంటే ఏంటో నిరూపించింది.
ప్రస్తుతం రంగ్ దే సినిమాలో నటిస్తున్న కీర్తి సురేష్ మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ సినిమాలు రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయ్.