తన నటనతో మహానటి అనిపించుకుని నేషనల్ అవార్డ్ సైతం అందుకున్న కీర్తి సురేష్ తెలుగులో వరుస సినిమాలతో సత్తా చాటుతుంది.సూపర్ స్టార్ మహేష్ తో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న కీర్తి సురేష్ మరోపక్క మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో సిస్టర్ రోల్ లో నటిస్తుంది.
ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర చాలా కీలకం అని తెలుస్తుంది.అందుకే హీరోయిన్ గా చేస్తూనే మరోపక్క సిస్టర్ రోల్ కు సైన్ చేసింది.
ఇదిలాఉంటే కీర్తి సురేష్ క్రేజ్ ను క్యాష్ చేఏసుకునేందుకు ఓ మీడియా ఛానెల్ ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది.కీర్తి సురేష్ తో ఓ ట్రెండీ టాక్ షో ప్లాన్ చేస్తున్నారట.
సెలబ్రిటీ టాక్ షో లాగా ఇది ఉంటుందని తెలుస్తుంది.ఈమధ్య ఓటీటీల్లో పాపులర్ అయిన ఈ టాక్ షోలను ప్రముఖ ఛానెల్ లో ప్లాన్ చేస్తున్నారట.
హోస్ట్ గా కీర్తి సురేష్ ను సెలెక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది.అందుకోసం ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీ అయినట్టు చెప్పుకుంటున్నారు.
మొత్తానికి కీర్తి సురేష్ కూడా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి వస్తుందని చెప్పొచ్చు. సిల్వర్ స్క్రీన్ పైనే కాదు స్మాల్ స్క్రీన్ పైన కూడా మహానటి టాలెంట్ చూపించేందుకు రెడీ అవుతుంది.