సూపర్ స్టార్ మహేష్ బాబు 27వ చిత్రంను పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే.సర్కారు వారి పాట అనే టైటిల్తో రూపొందబోతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
దర్శకుడు పరశురామ్ ఈ చిత్రం కోసం హీరోయిన్ గా కీర్తి సురేష్ను ఖరారు చేశాడు అంటూ ఆమద్య వార్తలు వచ్చాయి.కొన్ని రోజుల క్రితం కీర్తి సురేష్ కూడా ఒక లైవ్ ఛాట్లో మాట్లాడుతూ తాను మహేష్బాబు సర్కారు వారి పాట చిత్రంలో నటించబోతున్నట్లుగా ప్రకటించింది.
సర్కారు వారి పాట చిత్ర నిర్మాతలు మాత్రం ఇంకా హీరోయిన్ విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదని కొందరు హీరోయిన్స్ను పరిశీలిస్తున్నామంటూ చెప్పుకొచ్చారు.దాంతో కీర్తి సురేష్ ఫైనల్ కాలేదు అంటూ క్లారిటీ వచ్చేసింది.
ఈ సమయంలోనే ఈ చిత్రం కోసం బాలీవుడ్ హీరోయిన్స్ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంను బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు గాను ఉత్తరాది ముద్దుగుమ్మ అయితే బాగుంటుంది అనే అభిప్రాయం ఉంది.
అందుకే అనన్య పాండేను కూడా పరిశీలిస్తున్నారట.
ప్రస్తుతం అనన్య పాండే తెలుగులో విజయ్ దేవరకొండకు జోడీగా ఫైటర్ చిత్రంలో నటిస్తోంది.పూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రంతో ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక ఆ చిత్రం పూర్తి కాకుండానే ఈ అమ్మడికి సర్కారు వారి పాట చిత్రంలో ఛాన్స్ వచ్చిందంటూ టాక్ వినిపిస్తుంది.