మత్తు నుంచి బయటకు వచ్చి కొత్త సినిమా స్టార్ట్ చేసిన కీరవాణి కొడుకు

స్వర మాంత్రికుడు కీరవాణి కొడుకు సింహ ఇప్పటికే మత్తు వదలరా సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

 Keeravani Son Simha New Movie Launch, Tollywood, Telugu Cinema, Kala Bhairava, D-TeluguStop.com

రాజమౌళి ప్రమోషన్ కూడా సినిమాకి కలిసిరావడంతో బాగా వర్క్ అవుట్ అయ్యింది.ఆ సినిమాతో కీరవాణి మరో కొడుకు కాల భైరవ సంగీత దర్శకుడుగా పరిచయం అయ్యాడు.

మత్తు వదలరా సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సింహ మరల దసరా సందర్భంగా తన కొత్త సినిమా స్టార్ట్ చేశాడు.మణికాంత్ ఈ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇస్తున్నాడు.

స్టార్ ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.ఇదిలా ఉంటే రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొని క్లాప్ కొట్టి ఈ సినిమా లాంచ్ చేశాడు.
ఇక మొదటి సినిమాని థ్రిల్లర్ జోనర్ లో ఎంచుకున్న సింహ ఇప్పుడు రొమాంటిక్ కామెడీ స్టొరీతో తనలోని మరో యాంగిల్ ని ప్రెజెంట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమా కూడా లో బడ్జెట్ మూవీగా తెరకెక్కుతుంది.

ఇదిలా ఉంటే చిత్ర శుక్లా, మిషా నారంగ్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.రెండో సినిమాకే ఇద్దరు హీరోయిన్ల తో రొమాన్సు చేయడానికి రెడీ అవుతున్న సింహకి మొదటి సినిమా రేంజ్ లో ఈ సినిమా వర్క్ అయ్యేలానే ఉంది.

నిర్మాత సాయి కొర్రపాటి సినిమా అంటే కచ్చితంగా మంచి కాన్సెప్ట్ ఉంటుందనే పేరు ఉంది.ఇదిలా ఉంటె ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ మొదటి వారంలోనే స్టార్ట్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube