తెలుగు సినిమాను దేశానికి, ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడిగా రాజమౌళి పేరు సుస్థిరం చేసుకున్నాడు.కానీ రాజమౌళి హీరో కాకపోయి ఉంటే ఏమై ఉండేవాడు అనే ఆలోచనకు సమాధానం ఇన్నాళ్లకు దొరికింది.
ఎం ఎం కీరవాణి తండ్రి శివ శక్తి దత్తా ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయాలపై సంచలన సమాధానాలు ఇచ్చారు.తన కుటుంబంలో హీరో అయ్యే అవకాశాలు ఎవరికి లేవు అని కేవలం ఒక్క రాజమౌళి కి మాత్రమే ఆ లక్షణాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
తమ కుటుంబం ఎన్నో వందల ఎకరాలను కేవలం సినిమాల కోసమే అమ్ముకున్నామని చెప్పుకొచ్చారు శివశక్తి దత్త.
తమ కుటుంబం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న సమయంలో రాజమౌళి చిన్న పిల్లవాడు అని వాడికి కష్టాలు తెలియకపోయినా సినిమా మా రక్తంలో ఉంది కాబట్టి అవే లక్షణాలు వచ్చాయని ఆయన తెలిపారు ఇక కీరవాణి మాత్రం తమతో పాటు ఎన్నో ఇబ్బందులు గురయ్యాడని సినిమాల్లో మేము నష్టపోతే కుటుంబాన్ని కాపాడింది కీరవాణి అంటూ చెప్పుకొచ్చారు.ఇక ఈ మధ్యకాలంలో కీరవాణి కొడుకు హీరో అవ్వాలని ప్రయత్నిస్తున్న అంత సీన్ లేదని తేల్చి పారేశారు.చిన్నతనం నుంచి హీరో అవ్వాలి అని తానే చెప్పానని కానీ అందుకు కావలసిన లక్షణాలు అయితే ప్రస్తుతం అతనిలో కనిపించడం లేదంటూ చెప్పారు.
మా కుటుంబంలో రాజమౌళికి తప్ప ఆ అర్హత ఎవరికి లేదని, కానీ ఎన్ని సార్లు హీరోగా నటించమన్నా కూడా ఒక నవ్వు నవ్వి వెళ్లిపోయేవాడు అంటూ తెలిపారు శివశక్తి దత్త.ఒకవేళ రాజమౌళి హీరో అయి ఉంటే ఈరోజు దర్శకుడుగా ఉండేవాడు కాదని, కానీ సినిమా స్థాయిని ఈరోజు ఇంతగా ఉంచాడు అంటే అందుకు తనలో ఉన్న ఆ సినిమా ధ్యాస మాత్రమే కారణం అంటూ చెప్పుకొచ్చాడు తాము యవ్వనమో కూడా అతనిని ఏపని చేయాలో చెప్పి ఎంకరేజ్ చేయలేదని, తనకు నచ్చినట్టుగా తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు కాబట్టే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడని తెలిపారు.నిజమే కదా రాజమౌళి హీరో అయితే ఇండస్ట్రీ ఈ రోజు ఎలా ఉండేదో మరి.