‘అర్ధరాత్రి ఎన్నికలు పెట్టినా రెడీ’ అన్నారు.అందుకే అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాం.
కానీ ….అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత ఎన్నికలు వద్దంటూ మర్రి శశిధర్రెడ్డి అనేక కేసులు వేశారు.
ముందు తొడలు కొట్టడమెందుకు.? ఆ తరువాత వెనక్కి పారిపోవడం ఎందుకు?’’ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఇబ్రహీంపట్నంలో జరిగిన తెరాస ప్రజాశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ ‘‘ఎన్నికలు వస్తుంటాయి.పోతుంటాయి.ఇది సహజంగా జరిగే పరిణామం.ఏ పార్టీ చెప్పినా వినండి.ఇంటికి వెళ్లాక చర్చ చేయండి.ఎవరు ఎన్ని చెప్పినా… ఆలోచనతో ఓట్లు వేయాలి.
ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు, నాయకులు కాదు.ప్రజలు గెలవాలి.
అప్పుడే ప్రజల అజెండా అమలవుతుంది అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు.