తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల వారీగా పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే.నిన్న సిద్దిపేట జిల్లాలో పర్యటించిన కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం మాత్రమే కాక కొన్ని కార్యాలయాలను ఓపెన్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా నేడు వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.ఈ సందర్భంగా ఈ పర్యటనలో.
మూడు కార్యక్రమాలలో పాల్గొనున్నారు.
వరంగల్ మెడికల్ హబ్ గా మార్చే రీతిలో కెసిఆర్ వ్యవహరించనున్నారు. సెంట్రల్ జైల్ స్థలంలో అత్యాధునిక సూపర్ మల్టీస్పెషల్టి హాస్పిటల్ కి శంకుస్థాపన చేయనున్నారు.వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ కొత్త కార్యాలయాన్ని కూడా ఇదే పర్యటనలో ప్రారంభించనున్నారు.
అదేవిధంగా కాలోజీ వర్సిటీలో కూడా కొత్త భవనాన్ని ప్రారంభించనున్నారు.ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నేత దయాకర్ రావు మాట్లాడుతూ ఈ పర్యటన చరిత్రలో నిలిచిపోతుందని… జిల్లా పేరు కూడా మార్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.