తెలంగాణాలో విజయఢంకా మోగించిన టీఆర్ఎస్ పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతోంది.ఇప్పటికే.
టీఆర్ఎస్ శాసనసభ పక్ష నాయకుడిగా… కేసీఆర్ ను ఆ పార్టీ ఎమ్యెల్యేలు ఎన్నుకున్నారు.దీంతో … రేపు మధ్యాహ్నం 1.30 నిమిషాలకు రాజ్భవన్లో సిఎం గా కెసిఆర్ ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధం అవుతున్నారు.ఆయనతో పాటు మరొకరు మంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది.
తమ అంచనాల ప్రకారం… టీఆర్ఎస్ అభ్యర్థులు 95 నుంచి 106 మంది గెలవాల్సి ఉందని కేసీఆర్ మీడియా కు చెప్పుకొచ్చారు.ఖమ్మంలో అంతర్గత విభేదాల కారణంగానే… టిఆర్ఎస్ పార్టీ ఓడిందని తెలిపారు.గెలిచిన వాళ్లే కాదు గెలవని వాళ్లు తనకు ముఖ్యమేనన్నారు.గెలవని వాళ్లని కూడా కలవాలని.వాళ్లతో మాట్లాడాలని చెప్పారు.టిఆర్ఎస్ లో ఇంకా చాలా మంది చేరబోతున్నారన్నారు.
సభలో తానే సీనియర్ ఎమ్మెల్యేనన్నారు.తన తర్వాత రెడ్యానాయక్, ఎర్రబెల్లి ఉన్నారని కేసీఆర్ చెప్పారు.