రాజకీయాలలో అడుగు అడుగుకీ ఎవరో ఒకరిని అనుమానిస్తూ సాగాల్సిందే, ఎవరు ఎప్పుడు ఎవరి పక్కన ఉంటారో తెలీని పరిస్థితి.అందులో విశ్వ అనుభవం ఉన్న చంద్రబాబు గారికి ఈ అనుమానం కాస్త ఎక్కువే.
మరొక పక్క కెసిఆర్ కి వెటకారం పాళ్ళు ఎక్కువ.చంద్రబాబు ని సరదాగా కెలికి కెసిఆర్ కి కవ్వించడం తెలుసు కూడా.
అసలు విషయానికొస్తే, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కి ఓటేస్తామన్నారట.వదిన భువనేశ్వరి టీఆర్ఎస్కి ఓటేస్తానన్నారంటూ కేసీఆర్, ‘పొలిటికల్ పంచ్’ పేల్చారు.
ఫన్నీ థింగ్.టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి, టీఆర్ఎస్కి ఎలా ఓటేస్తారు.? అని కామన్సెన్స్ వున్న ఎవరైనా ఆలోచిస్తారు.కానీ, టీడీపీ అలా అనుకోలేదు.
టీడీపీ శ్రేణులు కంగారు పడ్తాయేమోనని, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కంగారుపడ్డారు.
తన తల్లి భువనేశ్వరితో ట్విట్టర్లో కామెంట్ పెట్టించారు.
కేసీఆర్ వ్యాఖ్యల్ని ఖండించేశారు.ఇక్కడే టీడీపీ కంగారు స్పష్టంగా కన్పిస్తోంది.
కేసీఆర్ మైండ్ గేమ్ వర్కవుట్ అయ్యింది.చంద్రబాబు సతీమణే టీడీపీకి ఓటేస్తానన్నప్పుడు, తెలంగాణలో ఎవరైనా.
సీమాంధ్రులతో సహా, టీఆర్ఎస్కి కాక టీడీపీకి ఎలా ఓటేస్తారు.? అన్నది కేసీఆర్ సెటైరికల్ లాజిక్.చంద్రబాబు కిందా మీదా పడి, గ్రేటర్ ఎన్నికల్లో చేసిన మొత్తం ప్రచారానికి కేసీఆర్, సింగిల్ డైలాగ్తో ఝలక్ ఇచ్చేశారు.కేసీఆర్ అన్నట్టే జరుగుతుందని కాదుగానీ, మైండ్ గేమ్లో మాత్రం కేసీఆర్, చంద్రబాబుపై పై చేయి సాధించారని చెప్పక తప్పదు.