టిఆర్ఎస్ పార్టీలో రాజ్యసభ సందడి ఎక్కువగా కనిపిస్తోంది.రాజ్యసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో సభ్యత్వం ఆశిస్తున్న నాయకులు అంతా తీవ్ర స్థాయిలో తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
సీఎం కేసీఆర్ ఎవరెవరికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలనే విషయంపై ఒక స్పష్టమైన క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.ఇప్పటికే కెసిఆర్ కుమార్తె కవిత, మరొకరి పేరు ఫైనల్ అయినట్లుగా ప్రచారం జరిగినా అటువంటిదేమీ లేదని పార్టీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.
ఇక బిసి, ఎస్సీ, ఎస్టీలకు ప్రస్తుతం అవకాశం లేనట్టుగా ప్రచారం జరుగుతోంది.టిఆర్ఎస్ కు రెండు రాజ్యసభ స్థానాల దక్కబోతున్నాయి.
సుమారు పది మంది వరకు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
గతంలో సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులను ఎంపిక చేసిన కెసిఆర్ ఇప్పుడు మాత్రం నమ్మకస్థులు, వీరావేద్యులకు మాత్రమే రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం రాజ్యసభ రేసులో ఎక్కువగా వినిపిస్తున్నపేరు కేసీఆర్ కుమార్తె కవిత.గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన వినోద్ కుమార్, అలాగే ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
పార్లమెంట్ స్థానాన్ని సిట్టింగ్ ఎంపీగా ఉన్న శ్రీనివాసరెడ్డికి కాకుండా టిడిపి నుంచి టీఆర్ఎస్ లో చేరిన నామా నాగేశ్వరరావుకు ఇవ్వడంతో ఈసారి రాజ్యసభ సభ్యత్వం తప్పకుండా కేసీఆర్ ఇస్తారని, ఈ విషయంలో జగన్ కూడా కెసిఆర్ కు సిఫార్స్ చేయడంతో తనకే రాజ్యసభ సభ్యత్వం వస్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుండగా కేసీఆర్ మాత్రం అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ఇప్పటికే తయారు చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.త్వరలోనే అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.ఇక కేసీఆర్ కుమార్తె రాజ్యసభ రేసులో లేరని ప్రచారం జరుగుతున్నా కేసీఆర్ మాత్రం ఆమెను ఒప్పించారని ఆమె పేరు ఫైనల్ అయినట్టుగా కూడా తెలుస్తోంది.
తనతో పాటు కవితను కూడా జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ చేసి తెలంగాణను పూర్తిగా కేటీఆర్ కు అప్పగించాలని కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది.అందుకే రాజ్యసభ సభ్యత్వాలను ప్రకటించి ఆ తరువాత కేటీఆర్ ను సీఎంగా చేసే విషయమై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.