ఈ నెల 11 నుండి గోల్కొండ బోనాల ఉత్సవాలు ప్రారంభం అవనున్నాయి.ఈ నేపథ్యంలో ఉత్సవ ఏర్పాట్లు, నిర్వహణలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమై సమీక్ష నిర్వహించారు.
ఈ నేపథ్యంలో కరోనా వల్ల గత సంవత్సరం బోనాలను నిరాడంబరంగా జరిపామన ఈ ఏడాది ఘనంగా నిర్వహించలని సీఎం కే.సి.ఆర్ ఆఏశించారని అన్నారు.బోనాలు కార్యనిర్వహణ కమిటీకి సూచనలు ఇచ్చారు.
కరోనా మహమ్మారిని పారద్రోలి ప్రజలను చల్లగా చూడాల్ని గోల్కొండ జగదాంబ అమ్మ వారిని కోరుతున్నానని తలసాని అన్నారు.
బోనాల సమయంలో అమ్మవారి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలి వస్తారని.
ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు.ఉత్సవాల సందర్భంగా సాంస్క్రృతిక కార్యక్రమాలకు 10 లక్షల మంజూరు చేస్తున్నామని చెప్పారు.
వివిధ ఉత్సవావాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలయాలకు 15 కోట్ల రూ.లు అందిస్తున్నామని అన్నారు.ప్రైవేట్ ఆలయాలకు కూడా ఆర్ధిక సాయాన్ని అందిస్తున్నామని అలా అందించే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే అని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.జీ.
హెచ్.ఎం.సీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ఏర్పాటు.సిబ్బంది నియామకానికి చర్యలు చేపడుతామని అన్నారు.