తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో.కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పని తీరుపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఆహార భద్రత కల్పించడం.
చట్ట ప్రకారం చూసుకుంటే కేంద్రానిదే అని.గతంలో ఇదే జరిగింది.కానీ బిజెపి అధికారంలోకి వచ్చాక.మధ్య తరగతి పేద ప్రజలను అదేరీతిలో రైతులకు సంబంధించి వ్యతిరేక విధానాలను.అమలు చేస్తున్నారని ఆరోపించారు.ఎవరూ ఊహించని విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేశారని.
ఇదే పెద్ద ఉదాహరణ అని తెలిపారు.ధాన్యాన్ని ప్రజలకు.
పంపిణీ చేసే విషయంలో నెలలు కొనసాగించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని తెలిపారు.
కానీ ధాన్యం కొనుగోలు విషయంలో చిల్లర కొట్టు యజమాని లాగా.
కేంద్రం వ్యవహరిస్తోందని కేసీఆర్ విమర్శలు చేశారు.తన భవిష్యత్తులో.
ఇంతటి నీచాతి నీచమైన కేంద్ర ప్రభుత్వాన్ని చూడలేదని, మళ్ళీ చూస్తామో లేదో.అంతా గందరగోళంగా కేంద్ర ప్రభుత్వం యొక్క నైజం ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
యాసంగి పంటలో నూకలు వస్తున్నాయని ఆ వడ్లను.బాయిల్డ్ రైస్ గా మార్చే క్రమంలో రాష్ట్రంలో పారా బాయిల్డ్ రైస్ మిల్లులు.రాష్ట్రంలో వెలిశాయి.ఇదంతా కేంద్రం యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తే ఇప్పుడు బాయిల్డ్ రైస్ కొనుగోలుకు.కేంద్రం నిరాకరించడం దారుణమని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.