రాజకీయ వ్యూహాలలో కేసీఆర్ ను మించిన రాజకీయ నాయకుడు లేడన్న విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు కేసీఆర్ వ్యూహాలు అత్యంత వేగంగా కదులుతున్నాయి.
ఇప్పటివరకు కొత్త సంక్షేమ పథకాల ప్రకటన చేయకున్నా మరల ఇప్పుడు కేసీఆర్ వాటిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.ప్రజల దృష్టి మరల్చడానికి ఈ వ్యూహాన్ని పన్నినట్లు తెలుస్తోంది.
అయితే టీఆర్ఎస్ రెండో సారి అధికారంలోకి రావడానికి ముఖ్యంగా దోహదపడింది.అందుకే మరల సంక్షేమ పథకాలపై కేసీఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఎందుకంటే ప్రతిపక్షాలు ఎంతగా దుమ్మెత్తి పోసినా మెజారిటీ ప్రజలు టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండే అవకాశం ఉండనున్న నేపథ్యంలో సంక్షేమ పథకాలు, ఆకస్మిక పర్యటనలతో ఒక్కసారిగా రాష్ట్రంలో ఫోకస్ మొత్తం కేసీఆర్ వైపే ఉండేలా చూసుకొని మరల అధికారంలోకి రావాలన్నది కేసీఆర్ వ్యూహంలా కనిపిస్తోంది.
అంతేకాక కెసీఆర్ మాత్రమే కాక కెటీఆర్ సైతం ఆకస్మిక పర్యటనలు చేస్తూ అధికారులను హడలెత్తిస్తున్నారని చెప్పవచ్చు.సంక్షేమ పథకాలు సక్రమంగా ప్రజల వద్దకు చేరుతున్నాయా లేదా అనే విషయాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు కెసీఆర్.తద్వారా క్షేత్ర స్థాయి ప్రజల మన్ననలు పొందడమే కాకుండా అక్కడ ప్రజలు ప్రస్తావించిన సమస్యలను కూడా పరిష్కరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఏది ఏమైనా కెసీఆర్ వేసే ఈ అడుగు ప్రతిపక్షాలకు మింగుడు పడని విషయం అని చెప్పవచ్చు.