ముఖ్యమంత్రి కేసీఆర్ మరల సంక్షేమంపై దృష్టి సారించారు.ఇటీవల ఓ జాతీయ సంస్థ జరిపిన సర్వేలో కేసీఆర్ పనితీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో, అదే విధంగా రోజురోజుకు తెలంగాణలో బీజేపీ బలపడుతుండడంతో ముఖ్యమైన హామీలను నెరేవేర్చే దిశగా కేసీఆర్ ముందుకు కదులుతున్నాడు.
ఇందులో భాగంగానే గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలని బలంగా నిర్ణయించుకున్నారు.ప్రస్తుతం చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.
ఎందుకంటే ప్రజలలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పనులపై ఎటువంటి అవగాహన ఉండదు.ఎన్నికల ప్రచారంలో నైనా తమ ప్రభుత్వం విజయాలు ఎన్ని ఎక్కువగా ఉంటే ప్రజలలోకి అంత వేగంగా వెళ్ళవచ్చు.ఇప్పటికే రైతులలో కేసీఆర్ పై కొంత సంతృప్తి ఉన్న పరిస్థితులలో సాధ్యమైనంత వరకు ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడితే రైతులలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.కావున కేసీఆర్ నిర్ణయం అమలై రైతులకు ఉపయోగకరంగా మారాలని ఆశిద్దాం.
అయితే ఇప్పటికే ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించిన విషయంలో భూ నిర్వాసితులకు అన్యాయం జరుగుతుందనే గట్టి విమర్శ ఉంది.వీటన్నింటినే అధిగమించి ప్రాజెక్టుల నిర్మాణంపై కేసీఆర్ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తారనేది వేచి చూడాల్సి ఉంది.
.