తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు.గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు.
కేసిఆర్ నివాళులు అర్పించారు.అనంతరం ప్రగతి భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్తో పాటు కేకే మరియు టిఆర్ఎస్ పార్టీకు చెందిన కీలక నాయకులు పాల్గొనడం జరిగింది.కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి.
జిల్లాలలో మంత్రులు అవతరణ దినోత్సవ వేడుకల్లో ఎక్కడికక్కడ కరోనా నిబంధనలు పాటిస్తూ పాల్గొనడం జరిగింది.దీనిలో భాగంగా సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ అమరవీరులకు నివాళులు అర్పించి కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు.
అదేవిధంగా ఆర్థిక మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో అమరవీరులకు నివాళులు అర్పించి ఆ తర్వాత జెండా ఆవిష్కరించారు. టిఆర్ఎస్ పార్టీ మాత్రమే కాక తెలంగాణ రాష్ట్రంలో వివిధ పార్టీల రాజకీయ నాయకులు కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
.