రాజకీయ వ్యూహాలలో కేసీఆర్ ను మించిన రాజకీయ నాయకుడు లేదన్నది సుస్పష్టం.ఎటువంటి గడ్డు పరిస్థితులు ఉన్నా వాటిని తనకనుకూలంగా మార్చుకోవడం అన్నది కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య.
అయితే రెండో దఫా సార్వత్రిక ఎన్నికల రాజకీయ పరిస్థితులకు ఇప్పటి రాజకీయ పరిస్థితులకు చాలా తేడా ఉంది.అయితే ఇప్పటికే రెండు సార్లు అధికారం చేపట్టిన కేసీఆర్ మూడో సారి అధికారం చేపట్టే దిశగా వ్యూహ రచన చేస్తున్నారు.
ఇప్పటికే అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా వరాలు ప్రకటిస్తున్న కేసీఆర్.ఎన్నికల సమయం నాటికి మరిన్ని ప్రజాకర్షక పథకాలు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే ఇప్పటికే ఇక మూడో సారి అధికారం లోకి రావడానికి కేసీఆర్ భారీ మాస్టర్ ప్లాన్ రచిస్తున్నట్టు తెలుస్తోంది.ఇక స్థానిక ప్రజల సమస్యలపై కూడా ఇక ఎన్నికల సమయంలో సరికొత్త పథకాలను ప్రవేశపెట్టనున్నాడు కెసీఆర్.అయితే ప్రతిపక్షాలు ఏ విషయాలనైతే ప్రజల ముందు ఉంచుతున్నాయో వాటిని ప్రజామోదం పొందేలా చేసి ప్రతిపక్షాల వ్యూహాలను చిత్తు చేసేలా భారీ మాస్టర్ ప్లాన్ తో ముందుకు రానున్నారు ముఖ్యమంత్రి కెసీఆర్.అయితే వీటిని బహిరంగంగా చెప్పకపోయినా వ్యూహం రూపంలో అమలు చేసే అవకాశం ఉంది.
భవిష్యత్తులో ఏమి జరగనుందనేది చూడాల్సి ఉంది.