తెలుగు రాష్ట్రాలలో కేసీఆర్ కు మించిన రాజకీయ దురంధరుడు లేడనే చెప్పవచ్చు.రాజకీయ వ్యూహాలు వేయడంలో కేసీఆర్ ను మించిన రాజకీయ నేత లేదనడం అందరూ అంగీకరించాల్సిన విషయమే.
అయితే ఒక్కొక్క రాజకీయ నాయకునికి ఒక్కో రాజకీయ విధానం, ఒక్కో పరిపాలన శైలి ఉంటుంది.అయితే కేసీఆర్ కు ఉన్న ప్రత్యేక శైలి ఏంటని ఒకసారి మనం గమనిస్తే కేసీఆర్ తీసుకునే నిర్ణయాల సారాంశం, ఆ నిర్ణయం వెనుక వ్యూహం ఎంతో ఆ వ్యూహం ఫలించి నాక అర్థమవుతుంది.
అయితే ఇప్పుడు కేసీఆర్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాడు.
అందులోనే భాగంగా తన నిర్ణయాలను వ్యతిరేకించిన వారిని టార్గెట్ చేస్తూ ఆ సదరు నాయకుడిని రాజకీయంగా బలహీనపర్చడం అనే వ్యూహాన్ని కేసీఆర్ ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఈటెల విషయాన్ని బూచిగా చూపి మిగతా ఈటెల తరహా నాయకులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.అందుకే ఈటెల వ్యవహారంపై తమ స్వంత అభిప్రాయాన్ని ఎక్కడ బహిరంగంగా చెప్పడం లేదు.
అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుకు ఎవరు అడ్డుపడుతున్నారని కేసీఆర్ భావిస్తున్నారో వారిని ముందుగా పార్టీ నుండి ఏరివేయాలన్నది కేసీఆర్ వ్యూహంలా కనిపిస్తోంది.మరి ఇంకా రానున్న కాలంలో ఇంకేం సంచలన నిర్ణయాలు తీసుకుంటాడనేది చూడాల్సి ఉంది.