టిఆర్ఎస్ చాలా సీరియస్ గానే హుజురాబాద్ ఎన్నికలలో ఈటల రాజేందర్ ను ఓడించగల అభ్యర్ధి కోసం వెతుకులాట చేస్తూనే ఉంది.ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తే రాజేందర్ ను ఓడించగలరో వారందరి పేర్లను పరిగణనలోకి తీసుకుంటుంది.
సామాజిక, ఆర్ధిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటూ, రాజేందర్ కు దీటైన అభ్యర్థిని ఎంపిక చేసే విషయాన్ని సీరియస్ గా టిఆర్ఎస్.
అనేక మంది పేర్లను పరిగణలోకి తీసుకుంది.
తాజాగా రిటైర్డ్ ఐఏఎస్ పేరును తెరపైకి తీసుకువచ్చింది.కమలాపూర్ ఎమ్మెల్యేగా, మంత్రిగా టిడిపి ప్రభుత్వంలో పనిచేసిన దామోదర్ రెడ్డి సోదరుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ముద్దసాని పురుషోత్తం రెడ్డి అభ్యర్థిత్వాన్ని టీఆర్ఎస్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.పురుషోత్తం రెడ్డి గతంలో నల్గొండ , మహబూబ్ నగర్ జిల్లాలో కలెక్టర్ గారు పని చేశారు నిజాయితీ పరుడిగా ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి .2009లో మహబూబ్ నగర్ ఎంపీ గా కేసిఆర్ గెలిచిన తరువాత 2010లో జిల్లా కలెక్టర్ గా పురుషోత్తంరెడ్డి బాధ్యతలు నిర్వహించారు.అక్కడే ఆయన రిటైర్ అయ్యారు.2013లో పే రివిజన్ కమిషన్ కార్యదర్శిగా ఆయన పనిచేశారు.
అలాగే టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వత వేములవాడ దేవాలయ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఆయన నియమితులైనప్పటికీ ఆయన ఆ పదవిలో ఉన్నారు.ఈ రిటైర్డ్ కలెక్టర్ ను పోటీకి దింపితే హుజురాబాద్ బలమైన రెడ్డి సామాజిక వర్గంతో పాటు , ముద్దసాని కుటుంబానికి ఉన్న పేరుప్రఖ్యాతులుు , పురుషోత్తం రెడ్డి మాజీ ఐఏఎస్ కావడం , నిజాయితీపరుడు అనే లే పేరు ఉండడం వంటివి కలిసొస్తాయని టిఆర్ఎస్ అభిప్రాయపడుతోంది. ఈ మేరకు ఒక సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు చాలా మంది ఆశావహులు పోటీ పడుతున్నారు.హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పేరును కెసిఆర్ పరిగణలోకి తీసుకుంటున్నారు.
అలాగే కాంగ్రెస్ కీలక నాయకుడిగా ఉన్న కౌశిక్ రెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చినా ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు మొగ్గుచూపుతుండటంతో ఆయనపై టిఆర్ఎస్ ఆశలు వదిలేసుకుంది.ఇక బీసీ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తే హుజురాబాద్ లో సీనియర్ నాయకుడిగా ఉన్న పొనగంంటి మల్లయ్య పేరును పరిశీలిస్తోంది.వీరందరి కంటే ఎక్కువగా పురుషోత్తంరెడ్డి కి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.