తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ ను ధీటుగా విమర్శిస్తూ విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తున్నారు.ప్రస్తుతం బీజేపీ ఉధృతంగా ఉన్న పరిస్థితి ఉంది.
అందుకు తగ్గట్లుగానే టీఆర్ఎస్ కు పరీక్ష అనే విధంగా వరుసగా ఎన్నికలు వస్తున్న పరిస్థితులలో బీజేపీ కూడా తన మాటల తూటాలకు పదును పెట్టింది.టీఆర్ఎస్ నాయకులు ఏవిధంగా భాషను ఉపయోగిస్తున్నారో వారి మాటలకు ధీటుగా బీజేపీ నాయకులు కూడా అదే పద జాలాన్ని ఉపయోగిస్తున్నారు.
ప్రస్తుతం ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మీద దృష్టి పెట్టిన బీజేపీ ఇప్పుడు గెలుపు వ్యూహాలను రచిస్తోంది.
ఈ సందర్భంగా బండి సంజయ్ కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పడు ఆసక్తికరంగా మారాయి.భాష విషయంలో కేసీఆర్ నాకు అదర్శమని, కేసీఆర్ ఎటువంటి భాష ఉపయోగిస్తే నేను కూడా అటువంటి భాషను వాడవలిసి ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఏది ఏమైనా బీజేపీ నుండి టీఆర్ఎస్ కు ముప్పు తప్పేలా లేదు.
కేసీఆర్ పై ముప్పేటా దాడిని పెంచుతూ ప్రతి ఎన్నికల్లో విజయం సాధించి టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయమనే భావన ప్రజలకు కలిగించాలన్నది బీజేపీ ప్రధాన వ్యూహంళా కనిపిస్తోంది.