తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు యాదాద్రి పర్యటనలో ఉన్నారు.కాగా త్వరలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్న నేపధ్యంలో సీఎం కేసీయార్ నరసింహ స్వామివారిని దర్శించుకోవడం, ఈ ఎన్నికల్లో కూడా తమ అభ్యర్ధులు గెలిచేలా చూడమని నరసింహ స్వామివారిని కోరుకుంటున్నారు కావచ్చని అనుకుంటున్నారట కొందరు ప్రతిపక్షాల వారు.
ఇకపోతే యాదాద్రి దర్శించడం తెలంగాణ ముఖ్యమంత్రికి కొత్తేమి కాదు.ఎందుకంటే 2016లో కేసీఆర్ యాదాద్రి పునర్నిర్మాణ పనులను ప్రారంభించిన విషయం తెలిసిందే.
అప్పటి నుండి తరచుగా ఈ ఆలయ నిర్మాణ పనులను స్వయంగా కేసీయార్ పరిశీలించడం జరుగుతుంది.
ఇక ఈ శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని 4.33 ఎకరాల్లో గోపురాలు, ప్రాకారాలు, దశావతారాలు వంటి అనేక విశిష్టలతలతో తీర్చిదిద్దుతున్నారు.కాగా, స్వామి వారి దర్శనం అనంతరం కేసీఆర్ అక్కడి అభివృద్ధి పనులను పరిశీలిస్తుండటం తెలిసిందే.
ఈ క్రమంలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి పూజలో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు.అంతకు ముందు కేసీఆర్ని అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.దర్శనం అనంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.