మాజీ మంత్రి ఈటెలను రాజకీయంగా దెబ్బ కొట్టడానికి కేసీఆర్ చేసిన రాజకీయ ప్రయత్నాలు అన్నీ, ఇన్నీ కావు.ఎందుకంటే భూకబ్జా ఆరోపణల కేసులో మాజీ మంత్రి ఈటెలను భర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈటెల ఇప్పుడు బీజేపీలో చేరడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ఈటెలపై ఎటువంటి వ్యూహాన్ని రచించకున్నా ఈటెలను కోలుకోని దెబ్బతీయడానికి భారీ వ్యూహానికి తెరలేపినట్టు సమాచారం.ఇప్పటికే గంగుల అస్త్రాన్ని తెరమీదికి తీసుకొచ్చిన కెసీఆర్ అది విఫలం కావడంతో మరల కొంత ఆలోచనలో పడి ఈటెలను దెబ్బ తీయాలంటే ఈటెల నియోజకవర్గంలో ఈటెలకు ధీటుగా బలమైన నేతను తయారుచేయాలన్నది కెసీఆర్ వ్యూహంలా కనిపిస్తోంది.
అయితే ఈటెలకు ధీటుగా బలమైన నేత అంటే కెప్టెన్ లక్ష్మీ కాంతారావు అన్న కొడుకు భరత్ రెడ్డిని బలమైన నేతగా తయారు చేసి.ఒకవేళ ఎన్నికల వేళ టీఆర్ఎస్ కు అనుకూల పవనాలు వీస్తే ఈటెలకు పెద్ద ఎత్తున షాక్ తగిలే అవకాశం ఉంది.
అయితే ఈ వ్యవహారాన్ని మొత్తం గమనిస్తున్న ఈటెల కూడా కెసీఆర్ వ్యూహానికి ప్రతి వ్యూహం పన్నుతున్నట్టు తెలుస్తోంది.నా కార్యకర్తలు, ప్రజలే నాకు బలమని నన్ను ఎవరూ దెబ్బ తీయలేరనే సంకేతాన్ని ఈటెల కెసీఆర్ కు ఇస్తున్న పరిస్థితి ఉంది.
ఒకవేళ ఉప ఎన్నిక వస్తే రాజకీయ వాతారణం అట్టుడికే ప్రమాదం ఉంది.