తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ నాయకురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేసీఆర్ ఇచ్చిన హామీ అమలు చేయలేదని విమర్శించారు.
నిరుద్యోగుల ఆశలను కేసీఆర్ నెరవేర్చలేదని డీకే అరుణ తెలిపారు.ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ప్రశ్నాపత్రాలను లీక్ చేశారని ఆరోపించారు.
ప్రశ్నాపత్రాలు లీక్ చేసిన వారిపై ఇప్పటికీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.కేసీఆర్ కు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీనే అధికారంలోకి వస్తుందని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు.