తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ మున్సిపల్ చైర్మన్లు మరియు కార్పోరేషన్లు దక్కుతాయని అంతా అనుకున్నారు.కాని ఎవరు కూడా ఈ స్థాయిలో మున్సిపల్ స్థానాలు వస్తాయని ఊహించలేదు.
అనూహ్యంగా టీఆర్ఎస్కు వచ్చిన ఈ విజయం ఆ పార్టీలో మరింత బలంను నింపింది.అన్ని జిల్లాల్లో కూడా అద్బుతమైన ఫలితాలను టీఆర్ఎస్ దక్కించుకోవడంపై కేసీఆర్ చాలా సంతోషం వ్యక్తం చేశారు.
ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ వెనుక నిలిచినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అన్నాడు.
ఫలితాల అనంతరం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ జిల్లా ఆ జిల్లా అని కాకుండా ప్రతి ఒక్క జిల్లాలో కూడా టీఆర్ఎస్కు మంచి ఫలితాలు వచ్చాయి.మేము గత ఆరు సంవత్సరాలుగా చేస్తున్న మంచి పనులకు ఇది మాకు దక్కిన విజయంగా నేను భావిస్తున్నాను.
ఈ విజయంతో మాపై బాధ్యత మరింత పెరిగింది.తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుఇ ముందుకు వెళ్తూ రాష్ట్ర అభివృద్దిలో ముందుకు సాగుతామని కేసీఆర్ అన్నారు.
ఈ విజయంకు పని చేసిన ప్రతి ఒక్క నాయకుడు మరియు కార్యకర్తలకు హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లుగా కేసీఆర్ పేర్కొన్నారు.