అక్కడకి వెళ్తే ...కేసీఆర్ కి బిర్యాని తిన్నంత ఆనందంగా ఉంటుందట

ఎప్పుడూ ఎదుటివారిపై పంచ్ డైలాగులు వేస్తూ.గరం గరంగా కనిపించే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల టెన్షన్లోనూ… సరదా సరదాగా మాట్లాడుతూ అందరిని ఖుషీ చేస్తున్నారు.

 Kcr Happy At Nagarkurnool Meeting-TeluguStop.com

తాజాగా కేసీఆర్ నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభతో కేసీఆర్‌ మాట్లాడుతూ… నాగర్‌కర్నూల్‌కు వస్తుంటే నాకు అద్భుతమైన సంతోషం కలిగింది.కాలువల్లో నీళ్లు చూస్తే గుండె ఉప్పొంగింది.

నాకు బిర్యానీ తిన్నంత సంతోషమైందని’ టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

తెలంగాణ సాధన ఉద్యమ సమయంలో ఇక్కడికి వస్తే నీళ్లు లేని కాలువలు, భూములు కనిపిస్తే చాలా బాధపడ్డానని చెప్పారు.మిత్రుడు దామోదర్‌రెడ్డితో నాగర్‌కర్నూల్‌ ప్రాంతంలోని కరువుపై చర్చించానని గుర్తు చేసుకున్నారు.కానీ ప్రస్తుతం మర్రి జనార్దన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు.

టీఆర్‌ఎస్‌ పాలనలో ఇక్కడి కాలువలు నీళ్లతో నిండిపోవడం చూస్తుంటే తన కడుపు నిండిపోయినంత సంబరంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube