బాబుకి తాను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అంటూ హడావుడి చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ వైకిరి అర్ధం కాక టీడీపీ అధినేత చంద్రబాబు తెగ హైరానా పడుతున్నాడు.ఇప్పటికే ఏపీలో జగన్ గెలుపు కోసం దాదాపు అన్నిరకాల సహాయ సహకారాలు అందించిన కేసీఆర్ ఏపీలో టీడీపీ ఓటమికి శాయశక్తులా కృషి చేసారు.
అయితే కేసీఆర్ కృషి ఎంత వరకు కలిసి వచ్చింది అనేది కొద్ది రోజులు ఆగితే కానీ తెలియదు.అయితే ఈ లోపున కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావుడి చేయడం బాబుకి ఆందోళన కలిగిస్తోంది.
ఏపీలో జగన్ ఖచ్చితంగా గెలుస్తాడని తన దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయని, జగన్ ప్రమాణ స్వీకారానికి తాను, కవిత కూడా హాజరవుతాము అంటూ కేసీఆర్ ప్రకటించి బాబు లో ఆందోళన మరింత పెంచాడు.
అయితే కేసీఆర్ దక్షిణాది పర్యటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను పెద్దగా పట్టించుకోనవసరం లేదని, కేసీఆర్ ఆ విషయంలో సక్సెస్ అవ్వలేదని చెబుతూనే లోలోపల ఆందోళన చెందుతున్నాడు.తాజాగా టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన బాబు కేసీఆర్ ను నమ్మి ఎవరూ ఫెడరల్ ఫ్రంట్ లో చేరడానికి ముందుకు రారని, ఆయన కష్టం అంతా వృధా అని ఎద్దేవా చేశారు.
అంతే కాకుండా కేసీఆర్ ఏ రాష్ట్రంలో పర్యటించినా, ఏ రాష్ట్ర నాయకుడిని కలిసినా వారెవరూ కేసీఆర్ ను నమ్మే స్థితిలో లేరని చెప్పుకొచ్చారు.ప్రస్తుతానికి ఫెడరల్ ఫ్రెంట్ అంటూ హడావుడి చేస్తున్న కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీకి అనుకూలంగా తన అజెండా మార్చుకుంటారని పార్టీ శ్రేణులతో వ్యాఖ్యానించారు.
అసలు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలన్నాఫెడరల్ ఫ్రంట్ కు బీజం పడాలన్నా సమన్వయం, కృషి, నిజాయితీ, విశ్వాసం, నిబద్ధత ఉండాలని, అవి కేసీఆర్ కు లేవు అని చంద్రబాబు నేతలతో మాట్లాడినట్టు తెలుస్తోంది.ఒక వేళ నిజంగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరిట జాతీయ స్థాయిలో పార్టీలన్నింటిని కలిపి మోదికి వ్యతిరేకంగా వెళితే తాను కూడా కేసీఆర్ తో కలుస్తానని బాబు పార్టీ శ్రేణులతో వ్యాఖ్యానించినట్టు సమాచారం.రాహుల్ గాంధీ కన్నా మెరుగైన ప్రధాని ప్రస్తుతానికి దేశంలో లేడని ఆయన సమాఖ్య వాదంతో పనిచేస్తారని, అందరినీ గౌరవిస్తాడని అందుకే ఖచ్చితంగా ఆయన పీఎం అవుతాడని బాబు జోస్యం చెప్పారు.అయితే బాబు పైకి ఇలా చెబుతున్నా, ఏపీలో టీడీపీ గెలవదు అనే విషయం అర్ధం అయిపోయిందని , ఇప్పుడు తన పాత్ర జాతీయ రాజకీయాల్లో ఏమీ ఉండదని, కేసీఆర్ మాత్రం హీరో అయిపోతాడనే బాబు అసలు బాధ అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.