కేసీఆర్ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వానికి చెప్పాల్సి రావడం సిగ్గుచేటని విమర్శించారు.
రాష్ట్రం ఈ పరిస్థితికి రావడానికి కారణమైన ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.రిపబ్లిక్ డేను ప్రగతిభవన్, రాజ్ భవన్ లకు పరిమితం చేసిన కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆరోపించారు.
ప్రస్తుతం దేశంలో బ్రిటీషర్స్ కాలం నాటి పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు.