ఈ మధ్య బీజేపీ కేంద్ర పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా తెలంగాణ రాజకీయాలపై సంలచన వ్యాఖ్లయు చేస్తున్నారు.అందరూ కూడా త్వరలోనే కేసీఆర్ ప్రభుత్వం మారిపోతుందని, రాజకీయాల్లో సంచలన మార్పులు వస్తాయని చెబుతున్నారు.
దీంతో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కూడా పెను సంచలనం తప్పదా అన్నట్టు అందరూ కూడా చూస్తున్నారు.ఇక బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు బండి సంజయ్ పాదయాత్రతో తెలంగాణలో మార్పు వస్తుందని బీజేపీ తెలంగాణ రాష్ట ఇన్చార్జి తరుణ్చుగ్ మొదటి నుంచి కూడా కామెంట్లు చేస్తూనే ఉన్నారు.
ఇక త్వరలోనే రాజకీయ మార్పు తప్పదని చెబుతున్నారు.అది కూడా ఈనెల 17 న నిర్మల్ జిల్లాలో తమ పార్టీ నిర్వహించే విమోచన సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా వచ్చి మార్పుకు శంకం పూరిస్తారని చెబుతున్నారు.
తెలంగాణంలో కల్వకుంట కుటుంబ పాలనకు చరమగీతం పడే సమయం దగ్గరికొచ్చిందన్నారు తరుణ్ చుగ్ వివరించారు.అందుకే ఈనెల 17 బహిరంగ సభ నిర్వహంచి తెలంగాణంలో కేసీఆర్ పాలనలో జరగుతున్న అక్రమాలను ప్రజలకు విమరిస్తామన్నారు.
ఎందో సమరయోధులు పుట్టినగడ్డ తెలంగాణ గడ్డపై కాషాయం జెండా ఎగరేస్తామన్నారు.నాడు కేంద్ర హోంమంత్రి వచ్చి గడీల పాలనను అంతమొందించారని, ఇప్పుడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా వచ్చి కేసీఆర్ పాలన నుంచి విముక్తి కలిగిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో త్వరలోనే మార్పు తథ్యమని ఆయన స్పష్టం చేశారు.బీజీపీ చీఫ్ బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రతో కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు.ఈ యాత్రను చూస్తుంటే త్వరలోనే తెలంగాణలో కాషాయ జెండా ఎగురుతుందన్నారు.కేసీఆర్ ను ఇంటికే సాగనందపేకు నిర్మల్లో నిర్వహించే సభ వేదిక కానుందన్నారు.
అమిత్షా సభను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, వాటిని ప్రజలలోకి తీసుకెళ్లాలన్నారు.