ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ హైదరాబాద్కు కూడా సోకిన విషయం తెల్సిందే.ప్రస్తుతం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో కరోనా వైరస్ బాధితుడు చికిత్స తీసుకుంటున్నాడు.
ప్రస్తుతం కరోనా వైరస్ భయంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అల్లాడుతున్న విషయం తెల్సిందే.బ్లాక్లో మాస్క్లు కొనుగోలు చేస్తూ ఉన్నారు.
అయితే కరోనా భయం అక్కర్లేదు అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు.
నేడు ప్రారంభం అయిన బడ్జెట్ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ ను హైదరాబాద్లోకి రానివ్వడం లేదని అన్నారు.
తెలంగాణలో అసలు కరోనా లేదు అన్నాడు.కరోనా లేకుండానే మాస్క్లు అంటూ ఎందుకు ఒకటే కొనుగోలు చేస్తున్నారు అంటూ కేసీఆర్ ప్రశ్నించాడు.
మన దేశంలో మొత్తం 130 మంది ఉంటే కేవలం 31 మందికి మాత్రమే కరోనా వచ్చింది.ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలంటూ ఈ సందర్బంగా కేసీఆర్ అన్నారు.