తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఏమాత్రం కరెక్ట్ కాదంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీని మరింత దిగజార్చడానికే ఈ సమ్మె అంటూ వ్యాఖ్యనించాడు.
డ్యూటీకి హాజరు కాని కార్మికులు స్వచ్చందంగా ఉద్యోగ విరమణ చేసినట్లుగా భావించాలంటూ ఆర్టీసీ యాజమాన్యంకు కేసీఆర్ ఆదేశించిన విషయం తెల్సిందే.దాంతో టెక్నికల్గా ఆర్టీసీ కార్మికులు అంతా కూడా ఉద్యోగాలు కోల్పోయినట్లు అయ్యింది.
కాని కేసీఆర్ తాజాగా మరో సారి ఆర్టీసీ కార్మికులకు ఛాన్స్ ఇచ్చాడు.
ఈనెల 5వ తారీకు లోపు సమ్మె విరమించి ఉద్యోగాల్లో చేరాలంటూ కేసీఆర్ విజ్ఞప్తి చేశాడు.
నేడు ఆర్టీసీ సమ్మెపై ప్రత్యేకంగా క్యాబినేట్ సమావేశంను నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదని తేల్చి చెప్పారు.
రాష్ట్రంలోని దాదాపు 5 వేల రూట్లను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్దం అయినట్లుగా ప్రకటించాడు.ఆర్టీసీ కార్మికులు కూడా మా బిడ్డలే.
వారిని మేము చులకనగా చూడటం లేదు.వారు కార్మిక సంఘాల నాయకుల మత్తులో పడ్డారు.
వారు బయట పడి ఆర్టీసీని కాపాడుకోవాలంటూ కేసీఆర్ కోరాడు.మరి ఈ గడువు వరకు అయినా ఆర్టీసీ కార్మికులు డ్యూటీలో జాయిన్ అవుతారో చూడాలి.