తెలంగాణాలో రాజకీయ నాయకుల ప్రచారాలు హోరెత్తుతున్నాయి.ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ… రాజకీయంగా కాక పుట్టిస్తున్నారు.
ఇక టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి అయితే… చెప్పనవసరం లేదు.తన ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తగ్గించేందుకు ఆయన తన మాటలను తూటాలుగా వదులుతున్నాడు.
తాజాగా ఆయన తన ప్రత్యర్థుల మీద ఇదే స్థాయిలో విరుచుకుపడ్డాడు.
పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని పనికిమాలిన దద్దమ్మ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.ఇక అంతటితో ఊరుకున్నాడా అంటే…? అదీ లేదు… ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీని అబద్దాలకోరు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అంతేకాదు… బక్కపలచని నన్ను కొట్టడానికి అందరూ ఏకమయ్యారు అంటూ… వారి నుంచి మీరే నన్ను కాపాడాలంటూ… ప్రజలను వేడుకున్నారు.బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షా పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని, కానీ నా హెలికాప్టర్ను చూడ్డానికి వస్తున్న జనం కూడా అమిత్షా సభలకు రావట్లేదని ఎగతాళి చేశారు .