కృష్ణా జలాలపై ఆంధ్ర తెలంగాణ మధ్య పెద్ద ఎత్తున నీటి యుద్దాలు జరుగుతున్న పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాం.ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తిని నిలిపివేయాలని కేంద్ర మంత్రి గజేంద్ర షేకావత్ కు కూడా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
అయితే ఇంతగా జరుగుతున్నా తెలంగాణ మంత్రులు స్పందిస్తున్నారే తప్ప కెసీఆర్ మాత్రం స్పందించడం లేదు.
దీని వెనుక ప్రధాన వ్యూహం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టి మరల్చడానికి ఈ వ్యూహం పన్నినట్లు అర్థమవుతుంది.ఎన్నిక ప్రచారంలో ఈ విషయాన్ని ప్రస్తావించి ఓటర్ల దృష్టిని ఆకర్శించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిపై పలు ప్రాజెక్టులు నిర్మించాలని యోచిస్తున్న పరిస్థితులలో కెసీఆర్ అభిప్రాయం అన్నది ఇక్కడ కీలకంగా మారింది.
కాని ఇరు రాష్ట్రాల మంత్రుల విమర్శలు, ప్రతి విమర్శలతో రోజురోజుకు ఈ అంశం హీటెక్కుతోంది.కేంద్ర జల సంఘం తక్షణమే ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చలు జరిపితే కాని ఈ వివాదం సద్దుమనిగే అవకాశం కనిపించడం లేదు.ఇది ఇరు సీఎం ల రాజకీయ వ్యూహమైతే ఇప్పట్లో పరిష్కారం దొరికే అవకాశం లేదు.
నిజంగా దృష్టి సారిస్తే పరిష్కారమయ్యే అవకాశం ఎక్కువ.