తెలంగాణ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు వరకు పూర్తిస్థాయిలో క్యాబినెట్ ఏర్పాటు చేయలేదు.ఎన్నికలు పూర్తయి మూడు నెలల పైనే అవుతున్న క్యాబినెట్ విస్తరణ పూర్తి కాకపోవడంతో తెలంగాణలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి.
నేపథ్యంలో తాజాగా తెలంగాణ క్యాబినెట్ విస్తరణ కి కెసిఆర్ ముహూర్తం ఫిక్స్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
క్యాబినెట్ విస్తరణ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు గవర్నర్ నరసింహన్ ని కలిసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
అధికారికంగా డేట్ ఎప్పుడు అనేది నిర్ణయం కాకపోయినా ఈసారి క్యాబినెట్ విస్తరణ లో కేసీఆర్ పదిమందికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.ఇప్పటికే క్యాబినెట్ పదవులకోసం ఆశావహులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరి కేసీఆర్ వేలలో ఎవరికి మంత్రి పదవులు ఇస్తాడని ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారింది.పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతున్న సందర్భంగా మంత్రి పదవులు నియామకంతో పాటు ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.