బీజేపీతో కేసీఆర్ చీకటి ఒప్పందం... సాక్ష్యాలు బయటపెట్టిన ఉత్తమ్

తెలంగాణలో ఒకప్పుడు ఒక్క వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ తన స్వంత తప్పిదాలతో ప్రజల్లో పలుచబడిందని చెప్పుకోవచ్చు.ప్రజల సమస్యలపై పోరాడడం మానేసి పార్టీ ప్రతిష్టను తాకట్టు పెడుతూ స్వంత ప్రయోజనాలకు కాంగ్రెస్ నేతలు ప్రాధాన్యం ఇస్తుండడంతో కాంగ్రెస్ ప్రజలు తమను పట్టించుకోకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో రుచి చూపించారు.

 Kcr Dark Deal With Bjp  Evidence Is The Best Bjp, Uttam Kumar Reddy, Ap Potics ,-TeluguStop.com

ఇక నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయానికొస్తే కాంగ్రెస్ కు ఈ ఎన్నిక ప్రతిష్టత్మాకంగా మారిన విషయం తెలిసిందే.కాంగ్రెస్ కంచుకోటగా పేరున్న నాగార్జున సాగర్ లో కూడా కాంగ్రెస్ ఓడిపోతే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రతిష్ట మసకబారుతుందనే చెప్పవచ్చు.

అయితే ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అక్కడ జోరుగా ప్రచారాన్ని ప్రారంభించారు.

అయితే ఈ సందర్బంగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

బీజేపీతో కేసీఆర్ కు చీకటి ఒప్పందం కుదిరిందని, అందుకే నాగార్జున సాగర్ ఎన్నికలో బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టిందని, విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంచుతున్నా ఎన్నికల సంఘం చూస్తూ ఉండడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ఉత్తమ్ దుయ్యబట్టారు.తెర వెనుక ఒప్పందాలు వలనే కేసీఆర్ విచిత్ర మైన నిర్ణయాలు తీసుకంతున్నాడని, నాగార్జున సాగర్ ఎన్నికలో కాంగ్రెస్ కు మద్దతు పలికి ప్రజలు కేసీఆర్ కు బుద్ధి చెబుతారని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube