రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల ప్రచార హోరు జోరందుకుంది.ఓ వైపు ఏపీలో టీడీపీ, వైసీపీ పార్టీలు ఎన్నికల ప్రచారంలో జోరు చూపిస్తూ ఉంటె, మరో వైపు తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతూ బీజేపీ పార్టీపై తీవ్ర వాఖ్యలు చేసారు.
బీజేపీ పార్టీని వారి సిద్ధాంతాలని ఎవరైన విమర్శిస్తే వారు హిందువులు కాదని, అసలు దేశభక్తి లేదనే విధంగా వాఖ్యలు చేస్తున్నారని దయ్యబట్టారు.అలాగే బీజేపీ సిద్ధాంతాలని విమర్శిస్తే తనపై కేసు పెట్టారని, తాను కూడా హిందువే అని, హిందువులు మాదిరిగానే యాగాలు చేస్తా, పూజలు చేస్తా అంత మాత్రాన హిందూయిజం అడ్డు పెట్టుకొని రాజకీయాలు సహించేది లేదని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
అలాగే నిజామాబాద్ జిల్లా రైతులకి కనీస మద్దతు ధర ఇవ్వడంతో పాటు తెలంగాణ బ్రాండ్ పసుపుని మార్కెట్ లోకి తీసుకొస్తా అని కేసీఆర్ ప్రచారం సభలో తెలియజేసారు.