కేసీఆర్ చాలా కాలం తరువాత తెలంగాణ భవన్ కి రావడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఎక్కడలేని ఉత్సాహం వెల్లువెత్తింది.ఈ రోజు మధ్యాహ్యం అకస్మాత్తుగా కేసీఆర్ తెలంగాణ భవన్ లో ప్రత్యక్షం అవ్వడంతో అక్కడ ఉన్న వారంతా షాక్ అయ్యారు.
ఎందుకంటే చాలా కాలంగా ఆయన పార్టీ కార్యాలయానికే రావడం మానేశారు.సడన్ గా అక్కడ కేసీఆర్ కనిపించడంతో అక్కడ ఉన్న నాయకులు ఆనందంలో మునిగితేలిపోయారు.
అయితే ఇంత అకస్మాత్తుగా కేసీఆర్ తెలంగాణ భవన్ కు రావడం వెనుక కారణం ఏంటా అని అక్కడ ఉన్నవారంతా చర్చించుకోవడం కనిపించింది.
తెలంగాణ భవన్ నిర్మించిన తర్వాత కేసీఆర్ ఎక్కువ సమయంలో అక్కడే ఉండేవారు.
మధ్యాహ్న సమయంలో తెలంగాణ భవన్ వచ్చే కేసీఆర్, అర్ధరాత్రి దాటే వరకు అక్కడే ఉండేవారు.అయితే, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ భవన్కు ముఖ్యమైన కార్యక్రమాల సమయంలో మాత్రమే రావడం మొదలైంది.
సంవత్సరం క్రితం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ను నియమించిన తరువాత నుంచి తెలంగాణ భవన్కు కేసీఆర్ రావడం తగ్గించేశారు.తాజాగా కేసీఆర్ తన ఆస్థాన వాస్తు సిద్దాంతితో కలిసి తెలంగాణ భవన్కు వచ్చారు.
పార్టీ కార్యాలయంలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై అక్కడ సిద్ధాంతితో కలిసి చర్చించారు.అదన్నమాట విషయం.