సాధారణంగా ఏ రాష్ర్టంలోనైనా విశ్వవిద్యాలయాలకు రాష్ర్ట గవర్నరే ఛాన్సలర్గా ఉంటారు.వైస్ ఛాన్సలర్లను ఆయనే నియమిస్తారు.
ఇప్పటివరకు ఉన్న సంప్రదాయం ఇదే.కాని తెలంగాణలో ఇక మీదట ఈ సంప్రదాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చరమగీతం పాడబోతున్నారని వినవస్తోంది.అన్ని విశ్వవిద్యాలయాలకు ఆయనే ఛాన్సలర్ (కులపతి)గా ఉంటారట.ఇందుకోసం ప్ర స్తుత చట్టాన్ని సవరించాలని ఆలోచిస్తున్నారని సమాచారం.వీసీల కోసం ఒక సెర్చ్ కమిటీని నియమించి వారు ఇచ్చే మూడు పేర్లలోంచి గవర్నర్ ఒకరిని వీసీగా నియమిస్తారు.ఈ విషయంలో ఒక్కోసారి గవర్నర్కు, రాష్ర్ట ప్రభుత్వానికి మధ్య వివాదం తలెత్తే అవకాశాలున్నాయి.
ప్రభుత్వం చెప్పిన పేరును గవర్నర్ కాదనొచ్చు.గవర్నర్ అనుకున్నవారిని ప్రభుత్వం ఇష్టపడకపోవచ్చు.
ఈ తలనొప్పి ఎందుకని కేసీఆర్ అనుకున్నారేమో తానే ఛాన్సలర్గా ఉండాలని ఆలోచన చేస్తున్నారు.తనకు ఇష్టమైనవారిని హాయిగా నియమించుకోవచ్చు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి అప్పట్లో ముఖ్యమంత్రి ఎన్టిఆర్ మొదటి ఛాన్సలర్గా ఉన్నారు.తెలంగాణలో ఇప్పటికే చాలా విశ్వవిద్యాలయాలకు వీసీలు లేరు.